ఓం నమో నారాయణా... శ్రీ వేంకటేశుని ఇలా పూజిస్తే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:33 IST)
వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం అని చెప్పబడింది. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందుకుగాను శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.
 
అనంతరం తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు "ఓం నమో నారాయణా" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. 
 
బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపమెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్ యాప్: రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, సోనూ సూద్‌లకు నోటీసులు

నదిలో కొట్టుకునిపోయిన ట్రాక్టర్... పది మంది గల్లంతు.. ఎక్కడ?

యూరియా కనీస వాడకాన్ని తగ్గిస్తే ప్రోత్సాహకం ఇస్తాం.. చంద్రబాబు ప్రకటన

అక్రమ వలసదారులకు ట్రంప్ తాజా వార్నింగ్.. అక్రమంగా అడుగుపెట్టారో...

Lok Sabha Rankings: లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిదే అగ్రస్థానం

అన్నీ చూడండి

లేటెస్ట్

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Daily Astrology: 13-09-2025 రాశి ఫలాలు.. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి..

Kalki: కల్కికి కలి శత్రువు: కలి బాధలు తొలగిపోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి

TTD: టీటీడీ వేదపారాయణాదార్ల నియామకానికి బ్రేక్.. ఇదంతా కుట్ర అంటూ భూమన ఫైర్

12-09-2025 శుక్రవారం ఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments