ఓం నమో నారాయణా... శ్రీ వేంకటేశుని ఇలా పూజిస్తే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:33 IST)
వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం అని చెప్పబడింది. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందుకుగాను శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.
 
అనంతరం తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు "ఓం నమో నారాయణా" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. 
 
బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపమెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో

మహిళల పట్ల బీఆర్‌ఎస్‌కు ఎటువంటి గౌరవం లేదు: కవిత ధ్వజం

ఒక పార్టీయేమో కాంగ్రెస్ తొత్తు, ఇంకోటి భాజపాకి తొత్తు, ఈ రెండూ మనకొద్దబ్బా: టీవీకె విజయ్

త్రిశూర్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 13మంది మృతి

టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

తర్వాతి కథనం
Show comments