ఓం నమో నారాయణా... శ్రీ వేంకటేశుని ఇలా పూజిస్తే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:33 IST)
వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం అని చెప్పబడింది. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందుకుగాను శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.
 
అనంతరం తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు "ఓం నమో నారాయణా" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. 
 
బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపమెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments