శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆళ్వార్ తిరుమంజన సేవ..

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:08 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. దీని కోసం 6 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగింది. తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయాన్ని శుద్ధిచేసే ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. 
 
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరానికి నాలుగు సార్లు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను పురస్కరించుకుని ఈ సేవను నిర్వహిస్తాం. ఈసారి బ్రహ్మోత్సవాల కోసం మంగళవారం ఆలయ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు. 
 
మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయ శుభ్రత కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయం మొత్తం ఈ సేవ జరిగింది. ఆళ్వార్ తిరుమంజన సేవకు అనంతరం స్వామి వారికి అభిషేక, అలంకరలు జరిగాయి. ఆపై భక్తులకు శ్రీవారి దర్శనం కలుగ జేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments