విజయవాడ: పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి రోజు (పాఢ్యమి తిధి)ని పురస్కరించుకుని విజయవాడలోని కృష్ణా తీరం శోభాయమానంగా మారింది. నగరంలోని స్నాన ఘాట్లన్ని పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల రద్దీతో సందడి నెలకొంది. కార్తీక మాసం చివరి రోజున భక్తులు పవిత్ర కృష్ణా తీరంలో భక్తిశ్రద్ధలతో పూజాధికాలు చేయడంతో పాటు అరటిడొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదిలి పోలిని స్వర్గానికి పంపించారు. శివ.. శివ, హర..హర నామస్మరణ చేస్తూ భక్తులు శివకేశవులను ఆరాధించారు.