Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

సెల్వి
శనివారం, 26 జులై 2025 (21:07 IST)
Jaggery
శ్రావణ ఆదివారం రోజున సాయంత్రం ఆరు నుంచి 7 గంటల మధ్య కాలంలో బెల్లంతో ఈ పరిహారం చేస్తే అంతా శుభం జరుగుతంది. భూములు, బంగారం కొంటూనే వుంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అప్పులన్నీ తీరిపోతాయి. భూములు కొనే అవకాశాలు వస్తూనే వుంటాయి. 
 
మంచి యోగం సిద్ధిస్తుంది. కాబట్టి శ్రావణ ఆదివారం బెల్లంతో ఇలా చేయడం మరిచిపోకండి. శ్రావణ ఆదివారం ఈ బెల్లం పరిహారం చేయడం ద్వారా రాజయోగం తథ్యం. బెల్లంతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. బెల్లం పవిత్రమైన పదార్థం. అందుకే దీనితో స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. 
 
శ్రావణ ఆదివారం కుందు బెల్లం కేజీగానీ, అరకేజీ తీసుకుని, కొంచెం కుంకుమను కూడా తీసుకుని.. ఆ కుంకుమలో నూనె కలిపి పేస్టులా చేసుకుని.. ఒక పుల్ల సాయంతో బెల్లం కుందు మీ కోరికను రాయండి. అంటే పేరు ముందు రాసి ఆ పేరు కింద మీ కోరికను రాయండి. ఇలా ఒక కోరికను మాత్రమే రాయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా మీ పేరు, కోరిక రాసిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయాలి. 
 
పొలాల దగ్గర, కంపల్లాగా చెట్లు పెరిగిన చోట ఈ బెల్లాన్ని పడేయాలి. శ్రావణ ఆదివారం రోజు 6-7 మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి. బెల్లాన్ని పడేసేముందు మూడుసార్లు మీ కోరికను చెప్పుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది జరుగుతుంది. అలాగే ఆదివారం ఇంటి గుమ్మం వద్ద ఇలా చేస్తే ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. 
 
ఏం చేయాలంటే.. శ్రావణ ఆదివారం రోజు ఉదయం 5-6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీరు తీసుకుని (రాగి, వెండి, స్టీల్, గాజు గ్లాసు ఏదైనా తీసుకోవచ్చు) అందులో పచ్చ కర్పూరం పొడి వేయాలి. దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు వుంటే.. ఆ అత్తరును కూడా 5 చుక్కలు నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపువ్వుల వాసన వచ్చే అత్తరు బెస్ట్. గులాబీ పూల వాసన వచ్చే అత్తరును గానీ కలిపినా మంచిది. ఇవి లేకపోతే రోజ్ వాటర్‌ని కలపడం మంచిది. 
 
ఈ నీటిని బాగా కలిపి బిర్యానీ ఆకుతో ఆ నీటిని గుమ్మం వద్ద చల్లండి. చల్లడం అంటే కలశం నీటిని ప్రోక్షణం చేసేట్లు చల్లాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 
శ్రావణ ఆదివారం ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. ధన సంపాదన పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో కలిసివస్తుంది. ఎలాంటి సమస్యలున్నా ఈ పరిహారంతో దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

తర్వాతి కథనం
Show comments