Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో దీపారాధన, ప్రాముఖ్యత ఏంటి?

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (22:31 IST)
పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైనదని తెలిసిందే. ఈ కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఈ జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారికి పుణ్యప్రదం. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని విశ్వాసం.
 
స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీక మాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణవ ఆలయాల్లోగానీ దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయి.
 
కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ ఎవరు చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడవునా చేసినవాళ్లు జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది.
 
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్చురీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'సార్.. నేను బతికే ఉన్నాను' అంటూ లేచి కూర్చొన్న వ్యక్తి...

మాటలు సరిగా రాని మైనర్ బాలికపై అత్యాచారం

చంద్రబాబు అరెస్టు చేసిన ఆరోజు, నేటితో రెండేళ్లు - కీలక మలుపు తిప్పిన ఘటన

గ్రహణం రోజున తలపై మండే కుంపటితో అఘోర శ్రీనివాసరావు (video)

ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన భార్య!!

అన్నీ చూడండి

లేటెస్ట్

చంద్రగ్రహణం సమయంలో పఠించాల్సిన శ్లోకం

పోలేరమ్మా అని వీరం బ్రహ్మేంద్రస్వామి కేక వేయగానే విగ్రహం నుంచి కదిలి వచ్చిన అమ్మవారు

Lunar Eclipse: చంద్రగ్రహణం: 12 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం

Bhadrapada Purnima 2025: భాద్రపద పూర్ణిమ 2025: పౌర్ణమి రోజున దానం చేస్తే.. చంద్రగ్రహణం కూడా జాగ్రత్త

06-09-2025 శనివారం ఫలితాలు - మనోధైర్యమే శ్రీరామరక్ష...

తర్వాతి కథనం
Show comments