గాయత్రీ దేవి మహిమ.. నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు..?

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (11:55 IST)
గాయత్రీ మహిమను ఆ దేవదేవి యొక్క అనుగ్రహాన్ని గురించి తెలిపే ఓ చిన్న కథను తెలుసుకుందాం. కథలోకి వెళితే... నిరంతర గాయత్రీ ఉపాసకుడైన గౌరీపతి అనే వ్యక్తి వృద్ధాప్యంలో మరణించాడు.
 
దేవదూతలు అతన్ని మణి ద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్లారు. తేజస్సుతో వెలిగిపోతున్న మాటను చూసి పులకించి పోయాడు గౌరీ పతి. అంతలో అదే దేవ దూతలు అతనికి బాగా తెలిసిన సింహాచలాన్ని తీసుకొచ్చారు. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు గౌరీపతి.
 
"అమ్మా.. నాదొక సందేహం" వినమ్రంగా అన్నాడు. ఏమిటన్నట్టు చూసింది మాత.  నా చిన్నప్పటి నుంచి నీ మంత్రో పాసనే శ్వాసగా జీవిస్తున్నాను… నీ పూజలు తప్ప నాకు మరేమీ తెలియదు.. జీవన పర్యంతం నీ సేవలో గడిపాను.. ఇంట కష్టపడితే నీ పేరు తలవని పరమ నాస్తికుడైన సింహాచలం నీ , సన్నిధికి ఎలా రాగలిగాడు? అడిగాడు గౌరీ పతి.
 
గాయత్రీ దేవి ప్రశాంతంగా నవ్వి. "ఆతను నాస్తికుడే.. కానీ నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు" అంది . గౌరీ పతికి అర్ధం కాలేదు.. సింహాచలం నాకు పూజలు చేయకుంటేనేం? అతను నిర్వర్తించింది నా సేవే .. ఎప్పుడూ పరుల సౌఖ్యం గురించి ఆలోచించాడు. 
 
మొక్కలు నాటుతూ మైళ్ళ కొద్దీ భూమిని పచ్చదనంతో నింపాడు.. పశు పక్ష్యాదులు ఆశ్రయం కల్పించాడు. ఆతను వెలిగించిన ఆ ఆకుపచ్చ దీపాలతో నేనెంతో సంతోషించాను"అంది.. అంతే గౌరీదేవి చెమర్చిన కళ్లతో నమస్కరించాడు. 
 
అదన్నమాట సంగతి. నిరంతం పూజతోనే దేవరుల అనుగ్రహం పొందవచ్చు అనుకుంటే పొరపాటు. పరుల కోసం ఆలోచించడం.. కష్టపడే వారికి సాయం అందించడం.. పరోపకారంతో దేవతాస్తుతి చేయడం ద్వారా ఉన్నత గతులు అందుతాయని గాయత్రీ మాత ఈ కథ ద్వారా తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

19-03-2016 గురువారం ఫలితాలు - అన్నింటా మీదే పైచేయి...

తర్వాతి కథనం
Show comments