కార్యార్థియైన ధీరుడు ఎలా వుంటాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (23:30 IST)
కార్యార్థి అయినవాడు సందర్భాన్ని బట్టి మెసలడంలో నేర్పరి అయి వుంటాడు. అతడు వీలునుబట్టి ఒకచోట భూశయనానికి అయినా సిద్ధపడతాడు. పరుపులపై పడుకునే అవకాశం వున్నప్పుడు, దానిని ఉపయోగించుకుంటాడు.

 
షడ్రషోపేతమైన భోజనం దొరికితే సరే... లేదంటే కాయగూరలతో చేసినవైనా ఆఖరికి పచ్చడి మెతుకులు తింటూ సరిపుచ్చుకుంటాడు. ఒకచోట పట్టుపీతాంబరాలను ధరించగలడు. వేరొకచోట బొంతగుడ్డపైన పడుకోగలడు.

 
అయితే అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏంటంటే... కష్టాలు కలిగాయని దుఃఖించడమో, సుఖాలు లభించాయని ఆనందించడమో వుండదు అతనికి. నీతివేత్తలైనవారి చేత పొగడబడినా, కొన్ని సందర్భాల్లో వారి చేతనే విమర్శించినా ధీరులు తమ న్యాయమార్గాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వారికి తాము అనుసరిస్తున్న మార్గం న్యాయమైనది అనే స్పృహ వుంటుంది కనుక.

 
అలాగే సంపదలు వచ్చినా, పోయినా, ఆ క్షణమే ప్రాణం పోతున్నా చాలా కాలం బ్రతికినా న్యాయం మాత్రం తప్పరు వీరు. ప్రశంసలకు, విమర్శలకు, అల్పాయుష్షుకు, అధికాయుష్షుకు న్యాయమార్గానుసారం నడిచేవారు లొంగరు. అదే వారి బలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments