డబ్బులుపోతే పోయింది.. పుణ్యమన్నా మిగిలింది... నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేసిన మోడీ

నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలి

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (11:57 IST)
నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారని సంబరపడిపోతున్నారు మోడీ. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేరుస్తోంది. 
 
వీలైనంత మేరకు దొంగదారుల్లో మార్చుకుంటున్న బడా బాబులు, మిగిలింది హుండీలో వేసి పుణ్యం కట్టుకుంటున్నారు. దానికి గత పద్నాలుగు రోజులుగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయమే నిదర్శనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు హుండీ ఆదాయం కోటి దాటిందంటే అబ్బా అనే వారు రాను రాను రోజుకు కోటిన్నర ఆదాయం తిరుమల హుండీ ద్వారా వచ్చేది. బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు అది రూ.2 కోట్ల రూపాయలకు చేరేది. కానీ గడిచిన పదిరోజులుగా తిరుమల హుండీ ఆదాయం రోజుకు 3 కోట్ల రూపాయలు తగ్గడం లేదు. ఒకవైపు చిల్లర లేక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంటే మరోవైపు హుండీ ఆదాయం మాత్రం పెరిగిపోతుంది. 
 
దీనిని బట్టి చూస్తే బడాబాబులు తమ నోట్లను మార్చుకోవడానికి యేదారి లేక ఆ డబ్బులు శ్రీవారి సమర్పించుకుంటున్నారు. మోడీ ప్రకటన వెలువడిన రోజు నుంచి రెండున్నర కోటికి ఏ రోజు తగ్గలేదు హుండీ ఆదాయం. రోజుకు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాత్రం రూ.2 కోట్లు దాటుతుందని కానీ వస్తున్న భక్తుల సంఖ్య రూ.80 వేలకు మించడం లేదు. హుండీ ఆదాయం మాత్రం రూ.4 కోట్లకు చేరుతుంది. మోడీ నిర్ణయంతో ఎవరికి లాభనష్టాలు ఎలా ఉన్నా కలియుగ దేవుడు వేంకటేశ్వరుడికి మాత్రం కాసులు కురిపిస్తోంది. కుబేరుడిని వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న ఆ వడ్డీకాసుల వాడు మోడీ పుణ్యమా అని అప్పులైనా తీర్చుకుంటాడేమో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments