అఖిలాండ నాయకుని గరుడోత్సవం..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కీలకమైన గరుడసేవ సోమవారం జరుగనుంది. గరుడసేవ రోజున, తనకెంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుడిపై ఆసీనుడయ్యే వెంకన్న, తిరుమాడవీధుల్లో విహరిస్తాడు. ఆ సమయంలో ఆ దేవ

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:34 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కీలకమైన గరుడసేవ సోమవారం జరుగనుంది. గరుడసేవ రోజున, తనకెంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుడిపై ఆసీనుడయ్యే వెంకన్న, తిరుమాడవీధుల్లో విహరిస్తాడు. ఆ సమయంలో ఆ దేవదేవుని చూసి తరించాలని, ఎంతో ప్రయాసతో వచ్చిన లక్షలాది మంది భక్తులతో ప్రస్తుతం తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. 
 
సోమవారం (సెప్టెంబర్ 17)న ఈ గరుడోత్సవం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమవారం దంతపు పల్లికిలో మోహినీ వేషధారణలో స్వామి కనువిందు చేయనున్నారు. అది ముగియగానే, మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ఉదయం 11 గంటల నుంచి గరుడోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులను అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.
 
బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకృతుడై, గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను స్వామివారు ధరించి భక్తులను దర్శనమివ్వనున్నాడు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భారీ ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గరుడోత్సవం సందర్భంగా గర్భాలయంలో మూలవరులకు సదా సమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదు పేటల సహస్రనామం, మకరకంఠి అనే పేరిట ఉండే ప్రాచీన మూడుపేటల తిరువాభరణం తదితరాలతో అలంకరిస్తారు.
 
గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గప్రాప్తి కలుగుతుందని, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. 
 
గరుడవాహన సేవ రోజున తిరుమలలో ఆకాశంలో గరుడపక్షుల సంచారం మరో అద్భుతమని తితిదే అధికారులు చెప్తున్నారు. గరుడసేవ జరిగే సమయానికి ఆకాశంలో గద్దలు తిరుగుతూ కనిపిస్తాయి. మిగతా ఏ సేవ రోజూ కూడా ఈ పక్షులు కనిపించవు. అందుకే గరుడోత్సవానికి అంతటి ఘనమైన ప్రాధాన్యముందని తితిదే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్వేతనాగుకు ఆపరేషన్.. పడగకు గాయం అయ్యింది.. వీడియో వైరల్ (video)

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments