ఏ రోజు పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం...?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:04 IST)
రావిచెట్టు ప్రదక్షణ చేసేటప్పుడు.. ఆ చెట్టును తాకవచ్చా.. అనే అనుమానం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ కథనం చదివి తెలుసుకోండి. వృక్షాలలో రావిచెట్టు దేవతా స్వరూపమని అంటారు. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే సహజంగానే పవిత్రమైన భావన కలుగుతుంది.
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షణలు చేయడం వలన సంతానం భాగ్యం కలుగుతుందని అంటారు. అలాంటి రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పురాణాలు చెబుతున్నాయి. 
 
రావిచెట్టు దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తూ ఉంటుంది. రావిచెట్టు అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని పండితులు సూచిస్తున్నారు. ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షణలు చేస్తుంటారు. ఏ రోజు పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవసం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన

బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments