Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువత ఉన్నతశిఖరాలను అధిరోహించాలంటే?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (22:55 IST)
నేటికాలంలో యోగ అంటే శరీర వ్యాయామమని అందరికీ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరూ అటువంటి శారీరక వ్యాయామము గురుంచి ఎంతో అభిరుచి చూపిస్తున్నారు. కాని నిజానికి యోగమనేది కేవలము శరీరానికే సంబంధించినది కాదు. అది ముఖ్యంగా మనస్సుకు  సంబంధించినది. మనస్సును నిగ్రహించడానికే మొట్టమొదటి యోగము, కచ్చితంగా యోగపద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇది అనేక వేల సంవత్సరాల క్రిందటే జరిగింది.
 
మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనషి ఈనాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు. మనిషి వీటిలో మూడవదైన బుద్ది ద్వారానే కార్యచరణ లేదా కార్యసాధన జరుగుతుంది. కాని మనస్సు చంచలత కారణంగా బుద్ధి గతితప్పి లక్ష్యసాధన తప్పిపోతుంది. అందుకే భగవద్గీతలో గీతచార్యుడు యోగానికి ఒక నిర్వచనాన్ని చెప్పాడు.
 
యోగః కర్మసు కౌశలమ్..
కర్మలో నేర్పరితనమే యోగము. యోగము ముసలివాళ్ళకు కానీ మాకెందుకు అని విద్యార్ధులు, యువత అనుకునే అవకాశం ఉంది. మనస్సుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతైన అవసరము. ప్రస్తుత కాలంలో విద్యార్ధులకు మనస్సు ఏకాగ్రత ఎంతో అవసరం. ఒక విద్యార్ధి చదువులో నూటికి నూరుమార్కులు సాధిస్తున్నాడంటే మనస్సును నిగ్రహించే ఆ కార్యాన్ని సాధించాడని చెప్పవచ్చు.
 
సాధారణంగా యువత, విద్యార్ధులను తప్పుదోవ పట్టించేవి ఇంటర్నెట్, వాట్సప్ సంభాషణలు, ఫేస్ బుక్‌లో కాలం గడపడం, వీడియోలు చూడటం, మత్తుపదార్ధాలకు అలవాటు పడటం. ముఖ్యంగా లక్ష్యం లేకపోవడం. ఇవన్నీ చంచలమైన మనస్సు ద్వారా కలిగేవి. కాని ఏ విద్యార్ధియైనా చదువులో సంపూర్ణ విజయాన్నిసాధిస్తున్నాడంటే, మానసిక ప్రలోభాల నుండి అతడు బయటపడినట్లేనని తెలిసుకోవాలి. అప్పుడు అతడు పూర్తిగా బుద్ధిస్ధాయిలోనే ఉంటాడు.
 
అతడు సాధించలేని కార్యమే ఉండదు. విద్యార్ధులకు, యువతకు తమ కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది. మన లక్ష్యసాధనకు అడ్డుపడే మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించడం వలన ఉన్నత స్థితిని చేరుకోగలం. కర్మలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments