పాదరస సాయిబాబా అనుగ్రహం..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:55 IST)
పాదరసంతో తయారుచేసిన సాయిబాబా ఆరాధనను విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యనైనా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. వీరి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే.

జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. అందుకు కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.
 
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు, గురువు తృతీయంలో ఉండడం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోషపరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించాలి.

ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపానంతరం ధూప, దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?

టెక్కీలకు నిద్రలేని రాత్రులు, 2026 మొదటి 3 నెలల్లోనే 73,000 ఉద్యోగులు తొలగింపు

ఇన్‌స్టా రీల్స్ పరిచయం.. 40 ఏళ్ల వితంతువుతో 21 ఏళ్ల వ్యక్తి ప్రేమాయణం.. పెళ్లి..

రాయలసీమ మార్కెట్లో రూ.40కి చేరిన కిలో టమోటా.. రైతుల హర్షం

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికను పీక్కుతున్న వీధి కుక్కలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

తర్వాతి కథనం
Show comments