Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘమాసం.. రథ సప్తమి, భీష్మ అష్టమి ఎప్పుడు.. ముల్లంగి తినకూడదా?

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:36 IST)
మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వున్నాయి. మాఘశుద్ద సప్తమి సోమవారం (ఫిబ్రవరి 7, 2022) వస్తోంది. ఇదే సూర్య సప్తమి లేదా రథసప్తమి అంటారు. తెల్లవారు జామున ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. 
 
ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. అలాగే భీష్మాష్టమి (మంగళవారం) మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. 
 
మాఘ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.  
 
మాఘమాసంలో చేయాల్సిన చేయకూడని పనులు: కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను, పంచదారను కలిపి తింటారు. నువ్వులను దానమిస్తారు. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments