Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (14:53 IST)
Lord Muruga
ప్రతి నెలా శుక్లపక్షం షష్ఠి రోజున స్కంధ షష్ఠిని జరుపుకుంటారు. ఈ రోజున కార్తీకేయ స్వామి ఆరాధన చేస్తారు. కార్తీకేయుడు దేవతల సేనాధిపతి. కార్తీకేయుడిని స్కంధ షష్ఠి రోజున పూజించడం ద్వారా జాతకంలోని సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తీకేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికి, కుజ దోష నివారణకు కార్తీకేయుడిని ఆరాధించడం ఉత్తమం. స్కంధ పంచమి, స్కంధ షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత కార్తీకేయ స్వామిని పూజిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది. 
 
అలాగే ఎవరి జాతకంలో అయినా నాగ దోషం, కాల సర్ప దోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యమవుతుంటే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తీకేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, స్వామి వారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
 
స్కంధ షష్టి రోజున పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి, మోక్షానికి మార్గం పొందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

తర్వాతి కథనం
Show comments