నిర్జల ఏకాదశి.. ఆ రోజున ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (00:01 IST)
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో జూన్ 10వ తేదీన శుక్రవారం ఉదయం 7:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. ఇదే ఏకాదశి మరుసటి రోజు అంటే 11 జూన్ 2022 శనివారం రోజున సాయంత్రం 5:45 గంటలకు ముగుస్తుంది. నిర్జల ఏకాదశి సమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 
 
నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి సూర్య దేవునికి నీటిని అర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షింతలు, చందనంతో పూజలు చేయాలి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడపాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలి. ఉపవాసం పూర్తయిన తర్వాతే నీటిని తాగాలి.
 
ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ఇమ్రాన్ ఖాన్ మృతి? పాకిస్తాన్‌లో పుకార్లు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

తర్వాతి కథనం
Show comments