Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

సెల్వి
గురువారం, 17 జులై 2025 (12:42 IST)
Lord Bhairva
కాలాష్టమి రోజు కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించడం ఆనవాయితీ. ఈ రోజు నల్ల కుక్కకు పొట్టు మినప్పప్పుతో చేసిన గారెలు, పెరుగు అన్నం ఆహారంగా ఇస్తారు. అనంతరం కాలాష్టమి వ్రత కథను చదువుకోవాలి. కాలాష్టమి రోజు కాల భైరవుడిని ఆరాధించడం వలన నవ గ్రహాల ప్రతికూల ప్రభావాలు, రాహు కేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. 
 
కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాల భైరవుడిని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
అలాగే భక్తిశ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. అంతేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. 
 
అలాగే కాలభైరవుని సమక్షంలో కాలాష్టమి రోజున సాయంత్రం ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణలు చేయాలి. కాల భైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: జన సైనికులు ఇలాంటి కుట్రలకు దూరంగా ఉండాలి.. పవన్ కల్యాణ్

Google Maps: సముద్రంలోకి కారు.. అలల మధ్య ఇరుక్కుపోయింది.. కారులో ఆ నలుగురు ఎవరు? (Video)

RK Roja: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు ఇచ్చారు.. రోజా ఫైర్

ఒక్క రీల్‌లో అలా పాపులరైన బర్రెలక్కకు పండంటి పాప పుట్టిందోచ్

మెట్రో రైల్లో మహిళ వెనుక నిలబడి ప్యాంట్ జిప్ తీసిన కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Pink Diamond: తిరుమల పింక్ డైమండ్ వివాదం ఎట్టకేలకు ముగిసింది.. ఎలాగంటే?

Today Horoscope: 11-09-2025 రాశి ఫలాలు.. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం

నీటితో దీపాలు వెలిగించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

50 సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక.. సూర్యుడు, గురువు- త్రి ఏకాదశ యోగంతో..?

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

తర్వాతి కథనం
Show comments