Jyeshtha Amavasya 2021: సూర్యునికి ఎర్రటి పువ్వులు, రాగి కుండలో ..?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (10:55 IST)
జ్యేష్ఠ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈసారి జూన్ 10న అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ రోజునే శని జయంతి అని కూడా పిలువబడుతోంది. ఈ రోజున చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. అదే రోజు పితృదేవతలను పూజించడం ద్వారా వారికి మోక్షం సిద్ధిస్తుంది. 
 
జ్యేష్ఠ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. నదికి వెళ్ళలేకపోతే, స్నానపు నీటిలో కొద్దిగా గంగా నీరు కలపండి. నీరు, అక్షత మరియు ఎర్రటి పువ్వులను ఒక రాగి కుండలో వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం అర్పించండి. పితృదేవతల కోసం ఉపవసించండి. పేదలకు దానం చేయండి. 
 
సాధారణంగా పౌర్ణమి రోజున వటసావిత్రిని పూజిస్తారు. అదే రోజు, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఇదే రోజున శని జయంతిని జరుపుకుంటారు. శని అదే రోజున జన్మించాడు. శని జయంతిని ఆరాధిస్తే, శని లోపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదే రోజున పూజలు చేస్తే, అది విశేష ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

తర్వాతి కథనం
Show comments