Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:35 IST)
''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది. ప్రజల కోరిక మేరకు ''రామాయణ్‌'' ధారావాహికను పునః ప్రసారం చేస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి రోజూ ఉదయం 9: 10 నిమిషాలకు ఒక ఎపిసోడ్‌, సాయంత్రం 9: 10 గంటలకు డీడీ ఛానల్‌లో రెండు ఎపిసోడ్‌లని ప్రసారం చేయనున్నారట. ట్విట్టర్ నెటిజన్‌ల విజ్ఞప్తులతో హోరెత్తిపోవడంతో ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 
 
33 ఏళ్ల క్రితం హిందీలో రామానంద సాగర్ తీసిన వీక్లీ సీరియల్ ఇది. 1987లో వచ్చిన ఈ ధారావాహిక ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రతీ ఆదివారం ఉదయం 10 అయిందంటే చాలు `రామాయణ్‌` డబ్బింగ్ సీరియల్ అయినా సరే చిన్నాపెద్దా.. ముసలీ ముతకా అంతా టీవీల ముందు పాతుకు పోయేవారు. 
 
85 వారాల పాటు నిరాటంకంగా సాగిన ఈ సీరియల్ 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌తో పూర్తియింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేయబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు ఇండియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్స్ అంతా ''రామాయణ్‌''ని పునః ప్రసారం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments