Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:35 IST)
''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది. ప్రజల కోరిక మేరకు ''రామాయణ్‌'' ధారావాహికను పునః ప్రసారం చేస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి రోజూ ఉదయం 9: 10 నిమిషాలకు ఒక ఎపిసోడ్‌, సాయంత్రం 9: 10 గంటలకు డీడీ ఛానల్‌లో రెండు ఎపిసోడ్‌లని ప్రసారం చేయనున్నారట. ట్విట్టర్ నెటిజన్‌ల విజ్ఞప్తులతో హోరెత్తిపోవడంతో ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 
 
33 ఏళ్ల క్రితం హిందీలో రామానంద సాగర్ తీసిన వీక్లీ సీరియల్ ఇది. 1987లో వచ్చిన ఈ ధారావాహిక ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రతీ ఆదివారం ఉదయం 10 అయిందంటే చాలు `రామాయణ్‌` డబ్బింగ్ సీరియల్ అయినా సరే చిన్నాపెద్దా.. ముసలీ ముతకా అంతా టీవీల ముందు పాతుకు పోయేవారు. 
 
85 వారాల పాటు నిరాటంకంగా సాగిన ఈ సీరియల్ 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌తో పూర్తియింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేయబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు ఇండియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్స్ అంతా ''రామాయణ్‌''ని పునః ప్రసారం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

Purandareswari: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో పురంధేశ్వరి, వానతి శ్రీనివాసన్?

గోదావరి నదిలో మునిగిన పడవ.. ఇద్దరి మృతి.. 10 మంది సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments