Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని పూజలు: సాయిదత్తం పీఠంలో అఖండ సాయి చరిత పారాయణం

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (21:30 IST)
సాయిదత్త పీఠంలో పూజలు
ఎడిసన్: కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం ఆ సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అఖండ సాయి చరిత పారాయణం కూడా నిర్వహించి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా చూడాలని సాయి దత్త పీఠంలో భక్తజనం ప్రార్థించారు. సర్వే జనా సుఖీనోభవంతు అనే సాయినాథుడి సందేశాన్ని భక్తులకు వివరించడంతో పాటు కరోనా వైరస్ బాధితులంతా కోలుకోవాలని ఆ సాయినాధుడిని వేడుకుందామని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి కోరారు. 
 
కరోనాతో మృతి చెందిన వారికి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనా నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలని ఆ సాయిదేవుడిని వేడుకున్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని  న్యూజెర్సీ  పబ్లిక్ యూటిలిటీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. చైనాలో వేయిమందికి పైగా ప్రాణాలను కరోనా కబళించడం.. 45వేల మందికిపైగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం దురదృష్టకరమన్నారు. 
ఈ ఊహించని విపత్తుల నుంచి మానవళిని రక్షించేందుకు దైవబలం కూడా అవసరమన్నారు. సాయిదత్త పీఠం సర్వేజనా సుఖీనోభవంతు అనేది ఎప్పుడూ చెబుతుందని దానికి తగ్గట్టే కరోనా బారి నుంచి ప్రపంచాన్ని రక్షించాలని కోరుతూ చేపట్టిన ఈ పూజలు, అఖండ సాయి చరిత పారాయణంలో పాలుపంచుకున్నవారికి ఉపేంద్ర చివుకుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
రాబోయే రోజుల్లో, భక్తులు మరియు రిత్విక్ టీం సభ్యుల సహకారంతో రుద్ర పారాయణం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, ధన్వంతరీ మూల మంత్ర జపం వంటి ఎన్నో కార్యక్రమాలను లోక కళ్యాణార్ధం చేయాలని తలపెట్టినట్టు రఘుశర్మ శంకరమంచి తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments