Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస ఆంధ్రుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్!

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రవాస వ్యక్తి కుటుంబాన్ని కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. ఇంటి యజమాని అనారోగ్యంతో చనిపోయినప్పటికీ.. భార్యాపిల్లలు కడచూపుకు నోచుకోలేకపోయారు. దీనికి కారణం ఆయన హైదరాబాద్‌లో చనిపోతే, భార్యాపిల్లలు మాత్రం సౌదీలో చిక్కుకునిపోయారు. చివరకు ఓ సామాజిక కార్యకర్త నాజ్ షౌకత్ అలీ పుణ్యమాని ఆ భార్యపిల్లలు స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడు వచ్చాకగానీ తమ ఆశాజ్యోతి ఇకలేరనే విషయం తెలుసుకుని గుండెపగిలిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,  విజయవాడకు చెందిన కిలంపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా సౌదీలోనే పని చేస్తున్నారు. ఆ తర్వాత ఈయన తన భార్య శారద, కుమార్తె సంజన శివానీలను కూడా సౌదీకి తీసుకెళ్లారు. కుమారుడు మాత్రం హైదరాబాద్‌లో ఉంటూ నివిసిస్తున్నాడు. 
 
అయితే, అత్యవసర పని నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన నెల రోజుల క్రితం చనిపోయారు. కానీ, భార్యా, కుమార్తె మాత్రం గల్ఫ్‌లో చిక్కుకునిపోయారు. 
 
అయితే, సత్యనారాయణ వీసాపైనే వీరిద్దరూ నివాసముండటంతో, గల్ఫ్‌ దేశం విడిచి వెళ్లడానికి ఎగ్జిట్‌ వీసాపై ఆయన అనుమతి అవసరం. ఆయన మరణించడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
సత్యనారాయణ యాజమాని వీరి వీసాలను ఎగ్జిట్‌ చేయడానికి వీలున్నప్పటికీ, వీరికి ఆయన గురించి సమాచారం తెలియకపోవడంతో జాప్యం జరిగింది. తల్లికూతుళ్ల పాస్‌పోర్టుల గడువు కూడా ముగియడమూ అవరోధంగా మారింది. 
 
అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న వీరి కుమారుడు.. తల్లి, సోదరిలను స్వదేశానికి రప్పించడానికి చేయని ప్రయత్నంటూ లేదు. తండ్రి మరణవార్తను తల్లికి చెప్పలేదు. భర్త గురించి కొడుకును ఫోన్‌లో ప్రశ్నిస్తూ బెంగతో శారద అనారోగ్యం పాలయ్యారు. 
 
వీరి పరిస్థితి తెలుసుకున్న సామాజిక కార్యకర్త నాజ్‌ షౌకత్‌ అలీ భారతీయ ఎంబసీ సహాయంతో తల్లీకూతుర్లను మిషన్‌ వందే భారత్‌లో భాగంగా విమానంలో ఎట్టకేలకు ఆదివారం హైదరాబాద్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం
Show comments