Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస ఆంధ్రుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్!

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రవాస వ్యక్తి కుటుంబాన్ని కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. ఇంటి యజమాని అనారోగ్యంతో చనిపోయినప్పటికీ.. భార్యాపిల్లలు కడచూపుకు నోచుకోలేకపోయారు. దీనికి కారణం ఆయన హైదరాబాద్‌లో చనిపోతే, భార్యాపిల్లలు మాత్రం సౌదీలో చిక్కుకునిపోయారు. చివరకు ఓ సామాజిక కార్యకర్త నాజ్ షౌకత్ అలీ పుణ్యమాని ఆ భార్యపిల్లలు స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడు వచ్చాకగానీ తమ ఆశాజ్యోతి ఇకలేరనే విషయం తెలుసుకుని గుండెపగిలిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,  విజయవాడకు చెందిన కిలంపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా సౌదీలోనే పని చేస్తున్నారు. ఆ తర్వాత ఈయన తన భార్య శారద, కుమార్తె సంజన శివానీలను కూడా సౌదీకి తీసుకెళ్లారు. కుమారుడు మాత్రం హైదరాబాద్‌లో ఉంటూ నివిసిస్తున్నాడు. 
 
అయితే, అత్యవసర పని నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన నెల రోజుల క్రితం చనిపోయారు. కానీ, భార్యా, కుమార్తె మాత్రం గల్ఫ్‌లో చిక్కుకునిపోయారు. 
 
అయితే, సత్యనారాయణ వీసాపైనే వీరిద్దరూ నివాసముండటంతో, గల్ఫ్‌ దేశం విడిచి వెళ్లడానికి ఎగ్జిట్‌ వీసాపై ఆయన అనుమతి అవసరం. ఆయన మరణించడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
సత్యనారాయణ యాజమాని వీరి వీసాలను ఎగ్జిట్‌ చేయడానికి వీలున్నప్పటికీ, వీరికి ఆయన గురించి సమాచారం తెలియకపోవడంతో జాప్యం జరిగింది. తల్లికూతుళ్ల పాస్‌పోర్టుల గడువు కూడా ముగియడమూ అవరోధంగా మారింది. 
 
అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న వీరి కుమారుడు.. తల్లి, సోదరిలను స్వదేశానికి రప్పించడానికి చేయని ప్రయత్నంటూ లేదు. తండ్రి మరణవార్తను తల్లికి చెప్పలేదు. భర్త గురించి కొడుకును ఫోన్‌లో ప్రశ్నిస్తూ బెంగతో శారద అనారోగ్యం పాలయ్యారు. 
 
వీరి పరిస్థితి తెలుసుకున్న సామాజిక కార్యకర్త నాజ్‌ షౌకత్‌ అలీ భారతీయ ఎంబసీ సహాయంతో తల్లీకూతుర్లను మిషన్‌ వందే భారత్‌లో భాగంగా విమానంలో ఎట్టకేలకు ఆదివారం హైదరాబాద్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments