Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై... అమెరికాలో దొంగ కంపెనీల పేరిట మోసం...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (16:27 IST)
కూర్చున్న కొమ్మని నరుక్కుంటే పడిపోతామనేది నీతి కథ... అది ఎలా మర్చిపోయారో కానీ ప్రబుద్ధులు అమెరికా వెళ్లి మరీ తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీని మోసం చేయబోయి అరెస్ట్ చేయబడ్డారు.
 
వివరాలలోకి వెళ్తే... అమెరికాలో దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి, తాను ఉద్యోగం చేస్తున్న సంస్థను మోసం చేసిన సిస్కో సిస్టమ్స్‌‌కి చెందిన మాజీ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ భిఖాను ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. 2017 మధ్య వరకూ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఆయన మారుపేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి సిస్కోకు చెందిన కాంట్రాక్ట్‌లన్నీ వాటికే వెళ్లేలా చేసారని అభియోగాలు నమోదు చేయబడ్డాయి. 
 
ఈ మేరకు 93 లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు గుర్తించిన కంపెనీ కేసు పెట్టింది. దీంతో పృథ్వీరాజ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మార్చి ఒకటో తేదీని అరెస్ట్‌ చేసి ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చగా 30 లక్షల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని అమెరికా అటార్నీ డేవిడ్‌ ఆండర్సన్‌, ఎఫ్‌బీ స్పెషల్‌ ఏజెంట్‌ ఇన్‌చార్జి జాన్‌ బెన్నట్‌ తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించబడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments