ఘనంగా కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం ఏర్పాటు(ఫోటోలు)

లండన్‌లో కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం KTSUK ( KCR & TRS SUPPORTERS UK ) ఏర్పాటు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి యుకే నలుమూలల నుండి సుమారు 150 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు తెరాస శ్రేణులు హాజరయినారు. ముందుగా జయశంకర్ గారి చిత్ర పట

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (17:24 IST)
లండన్‌లో కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం KTSUK ( KCR & TRS SUPPORTERS UK ) ఏర్పాటు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి యుకే నలుమూలల నుండి సుమారు 150 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు తెరాస శ్రేణులు హాజరయినారు. ముందుగా జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులర్పించి, జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 
సభ అధ్యక్షత వహించిన నగేష్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ 2002 నుండి కెసిఆర్ గారి ఆలోచనలకు, వారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొని గత 5 ఏండ్లుగా లండన్‌లో తెలంగాణ ఉద్యమంలో తెరాస పక్షాన తనవంతు బాధ్యత వహించాము. తెరాసకి మద్దతుగా యూకే మరియు యూరప్ దేశాల్లో తెలంగాణ ప్రజలను ఏకం చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయడానికి  ప్రజాస్వామ్యబద్దంగా తమవంతు కృషి చేయడానికి పూర్తి కార్యాచరణతో ముందుకు వెళ్తామని వివరించారు. 
 
ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులు సిక్కా చంద్రశేఖర్ గారు సంస్థ యొక్క ఆశయాలని భవిష్యత్ కార్యాచరణ ప్రెజెంటేషన్‌తో వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ప్రారంభం చేయాలన్న తాము పెట్టుబడులు పెట్టే వారికీ మరియు తెరాస గవర్నమెంట్‌కి వారదులుగా పని చేస్తూ చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అమలు జరిగే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
తమ సంస్థ NRI లో ఒక కొత్త ఒరవడితో ముందుకు వెళ్తుందని, సంస్థలో తారతమ్యాలు లేకుండా కేవలం NRIలకు మరియు తెరాస పార్టీకి వారధిగా పనిచేస్తుందని, ఇక్కడ స్థిరపడిన NRI తమతమ స్వగ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకు వారికి తోడుగా ఉంటుందని, అంతేకాకుండా ఇక్కడున్న NRIలకు సంబంధించిన హెల్త్ లేదా వివిధ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా తమ సంస్థ నుంచి తగిన సహాయం చేస్తామని సంస్థ సభ్యులు ప్రమోద్ అంతటి, వెంకట్ రంగు, భాస్కర్ పిట్టల, కృష్ణ, సురేష్ గోపతి, శశిరాజ్ మర్రి , గోలి తిరుపతి, నరేష్ మర్రియాల, రుద్రా శ్రీనివాస్, శివ నరపాక, రఘు గౌడ్, జయంత్ వడిరాజు, లక్ష్మి నరసింహారెడ్డి వెల్లడించారు. 
 
ముఖ్య అతిథిగా హాజరైన రాస్తాం కౌన్సిలర్ పాల్ సథానిసేం సంస్థ స్థాపన ఆశయాలు ఆలోచనలు ప్రశంసనీయం అని అన్నారు. తను కూడా సంస్థతో కీలక భాగస్వామి కానున్నట్లు తెలిపారు. ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, జాగృతి, హైదరాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు వివిధ తెలంగాణ తెలుగు సంస్థలు ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి

మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఉండాల్సిందే.. లేకుంటే ఉద్యమం తప్పదు.. కవిత

సర్.. నేను ఫెయిల్ అవుతాను.. ఎలాగైనా పాస్ చేయండి.. : అధికారికి విన్నపం.. చివరకు....

దటీజ్ పవన్ కళ్యాణ్ : పిఠాపురం స్థాయి పెంపు - రూ.37 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు

Satya Dev నా నుండి మరో సినిమా చూడాలని కీరవాణి గారు అడిగారు : వెంకటేష్ మహా

Sandeep Kishan: సందీప్ కిషన్, కృష్ణ చైతన్య కాంబినేషన్ లో పవర్ పేట ప్రకటన

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

Yash: గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా టాక్సిక్ ఉంటుందన్న యశ్

తర్వాతి కథనం
Show comments