Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిట్ జస్‌రాజ్ ఇకలేరు.. రాష్ట్రపతి - మోడీ సంతాపం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (22:52 IST)
పండిట్ జస్‌రాజ్ ఇకలేరు. హర్యానా రాష్ట్రంలో జన్మించిన ఆయన 90 యేళ్ళ వయసులో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో సోమవారం కన్నుమూశారు. శాస్త్రీయ సంగీతంలో దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు తీవ్ర సంతాపం తెలిపారు.
 
మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్‌రాజ్ మృతి తనను విషాదంలో ముంచెత్తిందని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 8 దశాబ్దాలకు పైగా అత్యద్భుతమైన కెరీర్ సాగించి సంగీత సామ్రాజాన్ని సుసంపన్నం చేసిన పద్మ విభూషణుడు జస్‌రాజ్ అని గుర్తుచేసుకున్నారు. జస్‌రాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇకపోతే, పండిట్ జస్‌రాజ్ మృతి దురదృష్టకరమని, భారతీయ సాంస్కృతిక, సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో వ్యాఖ్యానించారు. జస్‌రాజ్ సంప్రదాయ రాగాలు ఎంతో ప్రాచుర్యం పొందడమేకాకుండా, ఆయన ఎందరికో సంగీతంలో శిక్షణ ఇచ్చారని గుర్తుచేశారు. పండిట్ జస్‌రాజ్ కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు మోడీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments