Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంత్రీ భార్యాభర్తలు, తెలుగు విద్యార్థుల నుంచి 10 కోట్ల వసూలు, యుఎస్ నుంచి పరార్

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:26 IST)
అమెరికాలో హెచ్1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను నట్టేట ముంచారు కిలాడీ జంట. అమెరికాలో చదువుకుంటున్న ఎఫ్ 1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్‌కి హెచ్ 1 వీసాలు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేశారు ముత్యాల సునీల్, ప్రణీత. 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర సుమారు 10కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు.
 
అంటే ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లను వసూలు చేశారు. నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు 30 మంది తెలుగు విద్యార్థులు. ముత్యాల సునీల్, ప్రణీతలపై ఇంటర్‌పోల్ నోటీసులను జారీ చేశారు. దీంతో పరారయ్యారు సునీల్, ప్రణీతలు.
 
విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నారట. వీరు యూరప్ పారిపోయినట్లు భావిస్తున్నారు. సునీల్ తండ్రి స్వస్థలం వెస్ట్ గోదావరి. తండ్రి కోసం పోలీసులు వస్తే ఆయన కూడా పరారీలో ఉన్నారట. 
 
హెచ్ 1 వీసాల కోసం ఎవరిని నమ్మొద్దు అంటున్నారు పోలీసలు. కన్సల్టెంట్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, దీన్నయినా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments