Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:47 IST)
శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన్ని 50 శాతం మేర పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మిర్చీ శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. 
 
కళ్లు, చర్మ ఆరోగ్యానికి మిర్చిలోని విటమిన్‌ సి, బీటాకెరొటిన్‌లు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు తాజా పచిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మిర్చిల్లోని ఎండార్ఫిన్లు మనలోని ఉద్వేగాలని అదుపులో ఉంచుతాయి.
 
శీతాకాలంలో చికెన్‌తో మిర్చి గ్రేవీ తీసుకుంటే పిల్లల్లో జలుబు దూరం అవుతుంది. దగ్గు నయం అవుతుంది. అలాంటి పచ్చిమిర్చి-చికెన్ గ్రేవీ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ -అరకిలో, 
పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడా, 
నూనె: తగినంత, వెన్న: టేబుల్‌స్పూను, 
మిరియాలపొడి: టీస్పూను, 
గరంమసాలా: టీస్పూను,
పెరుగు: అరకప్పు, 
ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు: రెబ్బ
 
తయారీ విధానం: 
శుభ్రం చేసిన ముక్కలకు మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తలా ఓ కప్పు, ఐదు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి.. వీటిని మిక్సీలో రుబ్బుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక వెన్న లేదా నెయ్యి వేసి ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలుపుతూ పది నిమిషాల పాటు వేపుతూ వుండాలి. తర్వాత పెరుగు చేర్చి చికెన్ ముక్కలు వుడికే దాక వుంచి గ్రేవీ అయ్యాక దించేయాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments