Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగశిర కార్తె వచ్చేసింది.. కొరమీను కూర ఇలా ట్రై చేయండి..

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:43 IST)
కావలసిన పదార్థాలు 
కొరమీను చేపలు - అరకేజీ, 
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, 
ఉల్లిపాయ - ఒకటి, 
ఉప్పు - రుచికి తగినంత, 
పసుపు - అర టీస్పూన్‌, 
కారం- రెండు టీస్పూన్లు, 
నూనె - సరిపడా, 
కరివేపాకు - కొద్దిగా, 
కొత్తిమీర - ఒకకట్ట.
ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు
జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 
మెంతిపొడి - అర టీస్పూన్‌, 
చింతపండు - యాభై గ్రాములు
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కలను కాస్త కారం, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. ఒక బౌల్‌లో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి.
 
ఆపై ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేగాక, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. 
 
తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత సిద్ధం చేసుకున్న చింతపండు రసం మిశ్రమాన్ని చేర్చి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీలా తయారయ్యాక 
 
కొర్రమీను ముక్కలు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. అంతే కొరమీను గ్రేవీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments