Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే నెల్లూరు చేపల పులుసు తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:44 IST)
కావలసినవి:
చేపలు             -  అరకిలో
నువ్వుల నూనె  -  ఆరు టేబుల్‌‌‌స్పూన్లు
ఆవాలు           -  అర టీస్పూన్
జీలకర్ర            -  అర టీస్పూన్
మెంతులు        -  అర టీస్పూన్
మిరియాలు      -  అర టీస్పూన్
ఎండుమిర్చి      -  మూడు 
కరివేపాకు        -  కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు  -  ఐదు
అల్లం ముక్క     -  చిన్నది
పచ్చిమిర్చి       -  నాలుగు
ఉల్లిపాయలు     -  నాలుగు
చింతపండు       -  పెద్ద నిమ్మకాయ సైజంత
టొమాటోలు      -  ఆరు
పసుపు           -  టీస్పూన్
కారం              -  రెండు టీస్పూన్
ధనియాల పొడి -  మూడు టీస్పూన్
ఉప్పు            -  రుచికి తగినంత
 
తయారీ విధానం:
ఒక పాన్‌‌లో నువ్వుల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. మెత్తగా దంచిన అల్లం కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. చింతపండును రెండు కప్పుల నీళ్లలో 20నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండు కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేగించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. చిన్న మంటపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తరువాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేగించి పొడి చేసుకోవాలి. ఈ మసాల పొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్‌‌పై నుంచి దింపుకోవాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం
Show comments