Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలతో గారెలు ఎలా చేయాలి..?

Webdunia
సోమవారం, 15 మే 2023 (12:54 IST)
Fish Vadai
చేపలతో గ్రేవీ, ఫ్రై ఇలా రకరకాలుగా వంటకాలను టేస్ట్ చేసి వుంటారు. ఈరోజు మనం చేపలతో గారెలు ఎలా తయారుచేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
చేప ముక్కలు - 500 గ్రా 
గుడ్డు - 1 
బంగాళాదుంప - 100 గ్రా 
కారం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3 
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
ఉప్పు - కావలసినంత 
నూనె - వేయించడానికి
 
తయారీ విధానం
ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసి కొద్దిగా నీళ్లతో బాణలిలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని తీసుకుని ముల్లు, చర్మం తీసేయాలి. ఆపై బంగాళాదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి బాగా మెత్తగా చేయాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో ముళ్లు తీసిన చేపలు, మెత్తని బంగాళదుంపలు, కారం, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, గుడ్డు వేసి బాగా మెత్తగా గారెల పిండిలా చేయాలి.

ఆపై బాణలిని ఓవెన్‌లో పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అందులో ఫిష్ మసాలాతో గారెల్లా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే రుచికరమైన చేపలతో గారెలు రెడీ.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments