Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలం.. చింత చిగురుతో చేపలు కూర.. టేస్ట్ చేస్తే?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (18:25 IST)
చేపలు చలికాలంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. చేపలు వారానికి రెండు సార్లైనా డైట్‌లో చేర్చుకోవాలి. ఇంకా చింతచిగురును వంటల్లో లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే.. చలికాలంలో శరీరానికి కావలసిన వేడి లభిస్తుంది. అలాంటి చింత చిగురుతో చేపల కూర ఎలా చేయాలో చూద్దాం..
 
చేపలు- అరకేజీ 
చింతపండు-పావు కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్ 
గరంమసాలా- అరస్పూన్‌,
మిరప పొడి, ఉప్పు- తగినంత 
పోపు దినుసులు - కావలసినంత
పసుపు- తగినంత
నూనె- సరిపడా
 
తయారీ విధానం..
ముందుగా పసుపు పొడి వేసి బాగా శుభ్రం చేసిన చేప ముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ముల్లులు తీసేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో నూనె వేసి వేడయ్యాక... పోపు దినుసులు వేసి.. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని దోరగా వేపుకోవాలి. 
 
బాగా వేగిన తర్వాత.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పసుపు అందులో చింత చిగురు పోసి మిరపపొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చి దించేయాలి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments