చలికాలం.. చింత చిగురుతో చేపలు కూర.. టేస్ట్ చేస్తే?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (18:25 IST)
చేపలు చలికాలంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. చేపలు వారానికి రెండు సార్లైనా డైట్‌లో చేర్చుకోవాలి. ఇంకా చింతచిగురును వంటల్లో లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే.. చలికాలంలో శరీరానికి కావలసిన వేడి లభిస్తుంది. అలాంటి చింత చిగురుతో చేపల కూర ఎలా చేయాలో చూద్దాం..
 
చేపలు- అరకేజీ 
చింతపండు-పావు కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్ 
గరంమసాలా- అరస్పూన్‌,
మిరప పొడి, ఉప్పు- తగినంత 
పోపు దినుసులు - కావలసినంత
పసుపు- తగినంత
నూనె- సరిపడా
 
తయారీ విధానం..
ముందుగా పసుపు పొడి వేసి బాగా శుభ్రం చేసిన చేప ముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ముల్లులు తీసేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో నూనె వేసి వేడయ్యాక... పోపు దినుసులు వేసి.. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని దోరగా వేపుకోవాలి. 
 
బాగా వేగిన తర్వాత.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పసుపు అందులో చింత చిగురు పోసి మిరపపొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చి దించేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka: రాకా లుక్ కోసం రోజూ నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చిస్తోన్న అల్లు అర్జున్‌

VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి --ఎం.వెంకయ్య నాయుడు

Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్

తర్వాతి కథనం
Show comments