Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి 2024: ఉపవాసం వుంటే ఏం తినాలి.. ఏం తినకూడదు..?

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:06 IST)
నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు చాలామంది. ఒక రోజు లేదా పూర్తి తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నా, సరైన పోషకాహారాన్ని నిర్వహించడం మంచి ఆరోగ్యానికి అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఎక్కువసేపు ఉపవాసం ఉండకుండా రోజుకు చాలాసార్లు ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సుదీర్ఘ ఉపవాసం తర్వాత తేలికపాటి భోజనం లేదా పండుతో ప్రారంభించడం చాలా ముఖ్యం. బంగాళాదుంపలు, వేయించిన చిరుతిళ్లు లేదా చక్కెర కలిగిన ఆహారాలు అతిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. 
 
ప్రజలు నవరాత్రి ఉపవాసం పాటించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆహారం, నీరు రెండింటికీ దూరంగా ఉండాలని ఎంచుకుంటారు. మరికొందరు పండ్ల ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తారు లేదా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తింటారు. ఉపవాసం ద్వారా బరువు తగ్గాలని కోరుకునే వారికి బాగా పనిచేస్తుంది. 
 
ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం కాదు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉపవాసం మనస్సును ప్రశాంతపరుస్తుంది. రోజంతా ఏమీ తినకుండా ఆకలితో ఉండటం వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. దీంతో పోషకాల లోపానికి దారితీయవచ్చు.
 
ఉపవాసం పాటించే వారు పండ్లు, డ్రై ఫ్రూట్స్, హైడ్రేటింగ్ పానీయాలతో శరీరాన్ని పోషించడం చాలా అవసరం. రోజంతా మజ్జిగ, జ్యూస్, నీరు త్రాగటం వలన మీరు హైడ్రేటెడ్‌గా ఉంటారు, బాదం, జీడిపప్పు, వేరుశెనగ, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్‌లు ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. 
 
మధ్యాహ్నం భోజనం మానేయడం, రాత్రిపూట భారీ భోజనం తినడం హానికరం. సుదీర్ఘ ఉపవాసం తర్వాత పండ్లతో ఆహారం తీసుకోవడం ప్రారంభించడం మంచిది. వేయించిన ఆహారాలు లేదా స్వీట్లను ఎక్కువగా తినకుండా ఉండాలి.
 
ఉపవాస సమయంలో సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం చేయాలి. ఉపవాసాన్ని విరమించిన తర్వాత, పెరుగు, దోసకాయలు, యాపిల్స్, తేలికగా వేయించిన బంగాళాదుంపలు తీసుకోవచ్చు. 
 
రోజంతా ఉపవాసం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ చాలా తరచుగా దీనికి విరుద్ధంగా ఉంటుంది. రోజంతా ఆకలితో ఉండి, సాయంత్రం వేపుడు ఎక్కువ మొత్తంలో వేయించిన ఆహారాన్ని తీసుకునే వారు బరువు తగ్గడమే కాకుండా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
రోజంతా ఆహారం మానేసి రాత్రిపూట పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం, వెంటనే నిద్రకు ఉపక్రమించడం ద్వారా కాలేయం ఒత్తిడికి గురవుతుంది. ఇది బరువు పెరగడానికి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. 
 
అందుకే రోజంతా చిన్న, సమతుల్య భోజనం తినడం, హైడ్రేటెడ్ గా ఉండటం, వేయించిన లేదా పంచదారతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం మానేయడం ద్వారా ఉపవాసం ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా, మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

తర్వాతి కథనం
Show comments