Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైకాపా ఎమ్మెల్సీలు!!

jagan

వరుణ్

, బుధవారం, 24 జులై 2024 (12:10 IST)
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, మొత్తం 38 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉన్నారు. ఆ ఇద్దరూ బుధవారం జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఈ ఇద్దరు శాసనసభ్యులు వైకాపాను వీడటం తథ్యమని తేలిపోయింది. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికార మార్పిడి జరిగింది. వైకాపా అధికారాన్ని కోల్పోగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులే టార్గట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ తెగ గగ్గోలు పెడుతున్నారు. కేవలం నెల రోజుల కూటమి ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఆయన ఆరోపిస్తూ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే కారణంతో ఆయన బుధవారం ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ధర్నాకు ఇద్దరు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. వీరిలో తూమాటి మాధవ రావు,వంకా రవీంద్ర మాత్రం హస్తినకు వెళ్లలేదు కాద.. శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఇపుడు ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల్లో కూడా వీరి అంశం చర్చకుదారితీసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారంపై పెట్టుబడికి ఇదే కరెక్ట్ సమయమంటున్న నిపుణులు.. ఎందుకని?