Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనకదుర్గమ్మ నవదుర్గలుగా అవతరించడానికి గల కారణమేమిటి?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (13:34 IST)
దసరా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారి అంశ అయినటువంటి తొమ్మిది అవతారాలను భక్తితో పూజించే వారికి ఆ తల్లి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. మిగతా రోజుల కంటే పండుగ సందర్భాలలో అమ్మవారు ప్రసన్నంగా ఉంటారట. ఆ తల్లిని మనఃపూర్వకమైన భక్తితో పూజిస్తే సకల అబీష్టాలు నెరవేరుతాయి. కనకదుర్గమ్మ నవదుర్గలుగా అవతరించడానికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పూర్వం దేవతలు భండాసురడనే రాక్షసుని బారి నుండి తమను రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తిని తలచి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండములో వారివారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేశారు. దీనికి ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి దేవతల అభీష్టాన్ని నెరవేర్చింది. ఆ దేవదేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ శక్తి నుంచి వివిధ శక్తులు నవదుర్గలుగా అవతరించారు. 
 
వారిలో 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 3. చంద్రఘంట 4. కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయనీ 7. కాళరాత్రి 8. మహాగౌరి 9. సిద్ధిరాత్రి అను రూపాలతో ఆ తల్లీ ఆరాధనలు అందుకోసాగింది.తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ"చే గోకులం, బృందావనములలో పూజలందుకుందని పురాణాలు చెపుతున్నాయి. 
 
"బ్రహ్మ" కైటభుల బారి నుండి రక్షించుకోవడం కోసం అమ్మలగన్న అమ్మను స్తుతించి విముక్తి పొందాడని, 'పరమేశ్వరుడు' త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే దేవేంద్రుడు దూర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా.. ఈ పరాశక్తి సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగినాడని చెప్పబడింది.
 
అలాంటి మహామహులు, దేవతలు, సిద్ధులే ఆమెను నిష్టతో ప్రార్థించి తమ అభిష్టాలను తీర్చుకోగలిగారు. అందుచేత మనం కూడా ఆ దేవదేవిని మనసారా స్తుతించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Meher Baba: మెహెర్ బాబా ఎవరు? ఆయనెలా ఆధ్యాత్మిక గురువుగా మారారు?

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments