Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరొకరితో నిశ్చితార్థం చేశారనీ.. ప్రియురాలు.. ఆమె తల్లిని హతమార్చిన ప్రియుడు..

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (16:57 IST)
తన ప్రియురాలికి మరో  వ్యక్తితో నిశ్చితార్థం చేశారన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు.. ఆమె తల్లిని కూడా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జరార్ బ్లాక్ ఏరియాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జరార్ బ్లాక్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రెండు వారాల కిందట యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరొక వ్యక్తితో పెండ్లి ఖరారు చేశారు. 
 
గర్ల్‌ఫ్రెండ్‌పై కోపం పెంచుకున్న నిందితుడు ఆమెతో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అడ్డగించిన బాధితురాలి వదిననీ కత్తితో గాయపరిచాడు. బాధితురాలు, ఆమె తల్లి నిద్రిస్తుండగా టెర్రస్‌పై నుంచి లోపలికి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
 
పదునైన ఆయుధంతో వీరిపై దాడికి దిగడంతో తల్లీ కూతుళ్లు కామిని, శారదా దేవి మరణించారు. వారి అరుపులు విని అక్కడికి వచ్చిన బాధితురాలి వదినపైనా దాడిచేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. 
 
ప్రియురాలితో గత ఏడాదిగా నిందితుడు గోవింద్‌కు సంబంధం ఉందని దర్యాప్తులో వెల్లడైందని ఐజీ సతీష్‌ గణేష్‌, ఎస్‌ఎస్పీ బబ్లూ కుమార్‌ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పలు బృందాలను నియమించామని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments