Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉంది: అలహాబాద్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (10:56 IST)
యువతీయువకులకు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని అలహాబాదు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్పూర్‌కు చెందిన పూజా అలియాస్ బోయా షావెజ్‌లు ప్రేమించుకున్నారు.
 
వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరిని ఓ గదిలో నిర్భంధించారు. అయితే వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
 
ఈ ఫిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులను  తమ ఎదుట హాజరుపరచాలని తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీయువకులకు ఉందని స్ఫష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments