Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ కూడా మాకు అమ్మే.. బెంగాల్ సీఎం మమత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:15 IST)
తన తల్లిని కోల్పోయి తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కర్తవ్యా నిర్వహణలో నిమగ్నమయ్యారు. వర్చువల్‌గా హౌరా నుంచి న్యూ జుల్పాయిగురిల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకల కోల్‌కతాలో జరిగింది. 
 
ఇందులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. 
 
"వెస్ట్ బెంగాల్ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోడు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 
 
మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచాకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరుకావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారిపట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోడీ సైతం చలించిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments