Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ కూడా మాకు అమ్మే.. బెంగాల్ సీఎం మమత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:15 IST)
తన తల్లిని కోల్పోయి తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కర్తవ్యా నిర్వహణలో నిమగ్నమయ్యారు. వర్చువల్‌గా హౌరా నుంచి న్యూ జుల్పాయిగురిల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకల కోల్‌కతాలో జరిగింది. 
 
ఇందులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. 
 
"వెస్ట్ బెంగాల్ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోడు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 
 
మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచాకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరుకావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారిపట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోడీ సైతం చలించిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments