Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ కూడా మాకు అమ్మే.. బెంగాల్ సీఎం మమత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:15 IST)
తన తల్లిని కోల్పోయి తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కర్తవ్యా నిర్వహణలో నిమగ్నమయ్యారు. వర్చువల్‌గా హౌరా నుంచి న్యూ జుల్పాయిగురిల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకల కోల్‌కతాలో జరిగింది. 
 
ఇందులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. 
 
"వెస్ట్ బెంగాల్ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోడు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 
 
మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచాకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరుకావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారిపట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోడీ సైతం చలించిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments