Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తే గ్యాంగ్ రేప్ చేశారు, ఆపై ఆమె కరోనాతో మృతి

Webdunia
మంగళవారం, 11 మే 2021 (10:41 IST)
గత నెల దేశ రాజధానిలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన 25 ఏళ్ల ఉద్యమకారిణిపై కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... గత నెల ఏప్రిల్ 11న ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యామానికి మద్దతు తెలిపేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల మహిళా సామాజిక కార్యకర్త వచ్చింది. ఆ రోజు రైతుల నిరసనలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది.
 
మార్గమధ్యంలో తనతో కలిసి వస్తున్న కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనితో ఆమె తీవ్ర జ్వరం, అస్వస్థతకు లోనైంది. రాజధానిలో జగ్గార్ ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు ఆమెకి కరోనా సోకినట్లు నిర్థారించారు. చికిత్స తీసుకుంటున్న బాధితురాలు ఏప్రిల్ 30వ తేదీన కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
కాగా చనిపోయే ముందు బాధితురాలు తన పరిస్థితిని తండ్రికి వివరించింది. అలాగే తనపై జరిగిన సామూహిక అత్యాచారం విషయాన్ని కూడా తండ్రితో చెప్పడంతో ఆయన హరియాణా పోలీసుకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం