Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతానా మజాకా... కారు దిగిరాగానే పరుగో పరుగు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (17:42 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే గల్లీ లీడర్లే కాదు.. బడా నేతలకు హడల్. ఆమె ముక్కుసూటి మనిషి. పేదల ముఖ్యమంత్రి. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. అలాంటి ఆమెకు శనివారం సాయంత్రం ఊహించని అనుభవం ఒకటి ఎదురైంది 
 
పశ్చి మిడ్నాపూర్‌లో కొందరు ఆమెను చూసి 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం మమత ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
కొంతమంది గ్రామస్తులు తమ చేతిలో బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని చూడగానే 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. 
 
అంతే.. బీజేపీ కార్యకర్తలు ఆమెను చూసి పరుగు లంకించుకున్నారు. దీంతో మమత వారిని చూసి 'ఎందుకు పారిపోతున్నారు. ఇలా రండి...' అని పిలిచారు. వాళ్లంతా చాలా తెలివిగా తప్పించుకుంటున్నారంటూ పేర్కొన్న మమత అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి బయల్దేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments