Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న సీఎం యోగి

Webdunia
బుధవారం, 4 మే 2022 (13:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని ఐదేళ్ల తర్వాత కలుసుకున్నారు. పైగా, ఆయన తన స్వగ్రామానికి 28 యేళ్ల తర్వాత వెళ్లారు. దీంతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా, ఐదేళ్ళ తర్వాత తల్లిని కలుసుకున్న యోగి.. అమ్మ పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తల్లికి ఏ విధంగా దూరంగా ఉంటున్నారో అదే విధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన తల్లికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దీంతో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగం ఉప్పొంగింది. ఈ అరుదైన దృశ్యం ఉత్తరఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో చోటుచేసుకుంది. పౌరీ జిల్లాలోని పంచూర్ సీఎం యోగి స్వగ్రామం. ఈ గ్రామానికి ఆయన 28 యేళ్ల తర్వాత వచ్చారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments