Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఉద్యోగులకు యడియూరప్ప షాక్: 3నెలలు సెలవులు రద్దు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:58 IST)
కర్ణాటక ఉద్యోగులకు షాక్ ఇచ్చారు నూతన ముఖ్యమంత్రి యడియూరప్ప. మూడు నెలలపాటు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దంటూ హెచ్చరించారు. మూడు నెలలపాటు శని, ఆదివారాల్లో కూడా ఉద్యోగులు పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
గత సంకీర్ణ ప్రభుత్వంలో పాలన సజావుగా సాగలేదని, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  
 
అధికారులు పాలనపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల వరకూ ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. శనివారం అన్ని డివిజన్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహించారు.

కరువు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, పాలనను గాడిలో పెట్టేందుకు శని, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆదేశించారు. మూడు నెలలు వరకు నో హాలిడేస్ అని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి, ఎలాంటి ఆలస్యమూ లేకుండా వారికి వెంటనే పరిహారాన్ని చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
 
రైతులు పశుగ్రాసాన్ని టన్నుకు 4,000 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, పశుగ్రాసం పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇక, ఆల్మటి, నారాయణపూర్ డ్యాముతో పాటు మరో 10 బేరజ్‌లలో నీటి మట్టాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని యడియూరప్ప అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments