Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి.. ఎస్.కె జోషి

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:54 IST)
శ్రీనగర్ నిట్ లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేలా ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి న్యూడిల్లీ లోని తెలంగాణభవన్  అధికారులను ఆదేశించారు. జమ్ము కాశ్మీర్ లో నెలకొన్న పరిస్ధితుల నేపధ్యంలో నిట్ విద్యార్ధులు తాము రాష్ట్రానికి రావడానికి తగు సహాయం చేయాలని కె.తారకరామారావు ను కోరారని, వారు ఈ విషయాన్ని సి.యస్ దృష్టికి తీసుకువచ్చి తగు సహాయం అందించాలని కోరారు.

ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలను చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్ము నుండి డిల్లీ కి తీసుకరావడానికి బస్సులను  ఏర్పాటు చేశారని, డిల్లీ నుండి హైదరాబాదుకు రైలులో పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ జమ్ము కాశ్మీర్ భవన్ అధికారులతో సమావేశం కావడంతో పాటు జమ్ములోని డివిజినల్ కమీషనర్ తో మాట్లాడి విద్యార్ధులను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్ లో టచ్ లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారు.

జిఏడి అధికారులు రెసిడెంట్ కమీషనర్ కు తగు ఆదేశాలు జారీచేస్తూ, విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments