Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో చిక్కుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి... రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (12:04 IST)
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో అనేక గృహాలు నీట మునిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఇంట్లోకి కూడా నీరు వచ్చి చేరింది. దీంతో ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. బీహార్ రాష్ట్రంలో రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
యూపీలో 111 మంది, బీహారులో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహారులోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. 
 
ఇదిలావుంటే, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 145 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు పార్టీ కార్యకర్తలు సహాయం చేయాలని బీహార్ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments