Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో చిక్కుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి... రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (12:04 IST)
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో అనేక గృహాలు నీట మునిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఇంట్లోకి కూడా నీరు వచ్చి చేరింది. దీంతో ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. బీహార్ రాష్ట్రంలో రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
యూపీలో 111 మంది, బీహారులో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహారులోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. 
 
ఇదిలావుంటే, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 145 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు పార్టీ కార్యకర్తలు సహాయం చేయాలని బీహార్ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments