Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తయిన వంతెన నిర్మాణం

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (15:32 IST)
జమ్మూకాశ్మీర్‌‌‌ రాష్ట్రంలోని‌ ఉద్ధంపూర్‌‌‌‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాతావరణం సరిగా లేకపోయినా లెక్క చేయకుండా ఇంజినీర్లు, వర్కర్లు పనులు కొనసాగిస్తున్నారు. ఈ వంతెనను వచ్చే 2021 నాటికి పూర్తిచేయాలని ఇంజనీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ ఛైర్మన్‌‌, మేనేజింగ్‌‌ డైరెక్టర్ సంజయ్ గుప్తా వెల్లడించారు. 
 
ఇప్పటికే బ్రిడ్జ్‌‌ ఆర్చ్‌‌ చాలా వరకు పూర్తయిందని, దాని ఎత్తు ఈఫిల్‌‌ టవర్‌‌‌‌ కంటే 35 మీటర్లు ఎత్తు ఉంటుందని అన్నారు. 'బ్రిడ్జిని, టన్నెళ్లను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వాటిని అధిగమిస్తూ ఇంజినీర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తైతే అది ఇంజినీరింగ్‌‌ మిరాకిల్‌‌. ఖచ్చితంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం' అని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ కోఆర్డినేషన్‌‌ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ ఆర్‌‌‌‌కే. హెగ్దే ధీమా వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో కలిపేందుకు 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రపంచంలోనే ఎత్తైన ఈ వంతెన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments