Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తయిన వంతెన నిర్మాణం

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (15:32 IST)
జమ్మూకాశ్మీర్‌‌‌ రాష్ట్రంలోని‌ ఉద్ధంపూర్‌‌‌‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాతావరణం సరిగా లేకపోయినా లెక్క చేయకుండా ఇంజినీర్లు, వర్కర్లు పనులు కొనసాగిస్తున్నారు. ఈ వంతెనను వచ్చే 2021 నాటికి పూర్తిచేయాలని ఇంజనీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ ఛైర్మన్‌‌, మేనేజింగ్‌‌ డైరెక్టర్ సంజయ్ గుప్తా వెల్లడించారు. 
 
ఇప్పటికే బ్రిడ్జ్‌‌ ఆర్చ్‌‌ చాలా వరకు పూర్తయిందని, దాని ఎత్తు ఈఫిల్‌‌ టవర్‌‌‌‌ కంటే 35 మీటర్లు ఎత్తు ఉంటుందని అన్నారు. 'బ్రిడ్జిని, టన్నెళ్లను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వాటిని అధిగమిస్తూ ఇంజినీర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తైతే అది ఇంజినీరింగ్‌‌ మిరాకిల్‌‌. ఖచ్చితంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం' అని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ కోఆర్డినేషన్‌‌ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ ఆర్‌‌‌‌కే. హెగ్దే ధీమా వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో కలిపేందుకు 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రపంచంలోనే ఎత్తైన ఈ వంతెన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments