సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ కోసం, ఫాలోయర్స్ ప్రశంసల కోసం పలువురు తాము చేసే పనుల వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి విషాదకర ఘటన ఉత్తరకాశిలోని మణికర్ణిక ఘాట్ వద్ద జరిగింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశిలోని మణికర్నిక ఘాట్ వద్ద ఓ మహిళ రీల్ చేయాలనుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలోకి దిగింది. మోకాలి లోతు వరకూ వెళ్లి.. ఇంకాస్త లోపలికి అడుగు వేసింది. అంతే... ఆ అడుగు జారడంతో నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. నది ఒడ్డున వున్న బాలిక గొంతు... అమ్మ అనే అరుపు వినిపిస్తోంది. నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.