Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

Advertiesment
Ganga

ఠాగూర్

, సోమవారం, 3 మార్చి 2025 (09:17 IST)
దేశంలోని పవిత్ర నదుల్లో గంగానది ఒకటి. ఈ నది జలాలతో స్నానం చేయడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అయితే, ప్రస్తుతం ఈ నది జలాలు స్నానాకి ఏమాత్రం పనికిరావట. పట్టణాల నుంచి  మురుగునీరు వచ్చి నదిలో కలుస్తోందని, అందువల్ల నీటిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరినట్టు గుర్తించారు. ఫలితంగా చేపల పెంపకానికి, వ్యవసాయానికి మినహా స్నానానికి ఏమాత్రం ఈ నీరు సరిపడదని బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేల్చింది. 
 
రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో రెండు వారాలపాటు నిర్వహించిన గంగానది నీటి నాణ్యత పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25లో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
గంగానది, దాని ఉప నదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చి కలిసే నీరు కారణంగా నదిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరిందని సర్వే వివరించింది. అలాగే, గంగా, దాని ఉపనదుల్లో పీహెచ్, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వంటివి మోతాదుకు మించి ఉన్నాయని తేల్చింది. 
 
ఈ నీరు జల జీవరాశుల, చేపల పెంపకానికి, వ్యవసాయానికి సరిపోతుందని పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మమ్ శుక్లా మాట్లాడుతూ, కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల కంటే గంగానదిలో చాలా చోట్ల ఫీకల్ కోలిఫాం పరిమితి మించివుందని తెలిపారు. అందువల్ల ఈ స్నానానికి పనికిరాదని చెప్ారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ