Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెడ్డం గీసుకోలేదని భర్తపై వేడి నీళ్లను పోసేసిన భార్య.. ఎక్కడ?

గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పో

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (10:35 IST)
గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పోసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలీగఢ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ (32), నగ్మా భార్యభర్తలు. మత విశ్వాసం కారణంగా సల్మాన్ గెడ్డం పెంచుతూ వస్తున్నాడు. 
 
భర్త గెడ్డం పెంచడంపై శుక్రవారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నగ్మా భర్తపై మరుగుతున్న నీళ్లు పోసింది. ప్రస్తుతం సల్మాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరునెలల క్రితమే వివాహమైందని.. ఇప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
 
భర్త ఆహార్యం విషయంలో నగ్మా చేసే సూచనలను ఏమాత్రం సల్మాన్ పట్టించుకోకుండా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. కాగా, భార్య నగ్మాపై సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగ్మాపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments