Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-చైనా సరిహద్దుల్లో మహిళ హల్ చల్.. శివుడ్ని పెళ్లాడబోతున్నా

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (12:45 IST)
భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేస్తోంది. లక్నోకు చెందిన ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని, కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నానని చెప్తోంది. వివరాల్లోకి వెళితే... నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని గుర్తించిన పితోరాగఢ్ పోలీసులు ఆమెను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, తనను బలవంతంగా తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దాంతో వెనుదిరిగిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద బృందంతో వెళ్లాలని నిర్ణయించారు. 
 
హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఆమెకు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఆమె నిషిద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో పాటు, అనుమతించిన మేర గత నెల 25తో కాలపరిమితి పూర్తయిందని వివరించారు. దాంతో ఆమెను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. 
 
ఇద్దరు ఎస్సైలు, ఓ ఇన్ స్పెక్టర్ తో ఒక పోలీసు బృందాన్ని పంపిస్తే ఆమె తిరిగొచ్చేందుకు ససేమిరా అంటోందని, ఈసారి 12 మందితో పెద్ద బృందాన్ని పంపిస్తామని, ఆమెను నిషేధిత ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువస్తామని ఎస్పీ లోకేంద్ర సింగ్ వెల్లడించారు. తానే పార్వతీదేవినంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments