Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను సినిమా థియేటర్‌లోకి పంపించి వివాహిత ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:16 IST)
చెన్నై విమానాశ్రయంలో దారుణం జరిగింది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లను సినిమాకు పంపించి, ఆమె ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన పార్కింగ్ టెర్మినల్‌ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చెన్నై పొళిచ్చలూరు కమిషనర్ కాలనీకి చెందిన ఐశ్వర్య (33) అనే మహిళ భర్త ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. ఈమె తన ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వల్ రెండో భాగం చిత్రం చూసేందుకు చెన్నై ఎయిర్‌ పోర్టులోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కు తన ఇద్దరు పిల్లలను ఆ మహిళ తీసుకెళ్లారు.

ఇద్దరు పిల్లలకు టిక్కెట్ తీసి థియేటర్‌లోకి పంపించిన ఆ మహిళ..  పార్కింగ్‌ ఏరియాను చూసేందుకు వెళుతున్నట్టు చెప్పి నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశారు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు మృతదేహన్ని స్వాధీన చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments