Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ కేంద్రంలోనూ వేధింపులా..? వీడియో తీసి పోస్ట్ చేసిన..?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (12:31 IST)
మహిళలపై కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లిన మహిళలపై కూడా వేధింపులు జరుగుతున్నాయి. 
 
తాజాగా క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వలస కార్మికురాలిపై స్థానిక సర్పంచి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సువర్ణపూర్‌ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో ఆదివారం చోటుచేసుకుంది. సంబంధిత బాధిత యువతి సర్పంచిపై ఆరోపణలు చేస్తూ తనకు న్యాయం చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. జూన్‌ 1వ తేదీన తమిళనాడు నుంచి కొంతమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సువర్ణపూర్‌ జిల్లాకు చెందిన ఆయాప్రాంతాల క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. ఇందులో అందారిబంచి క్వారంటైన్‌లో ఉన్న ఓ యువతికి ప్రత్యేక గది కేటాయించారు. 
 
స్థానిక సర్పంచి బనమాలిషా రోజూ రాత్రిపూట మద్యం తాగి కేంద్రానికి వచ్చి తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments