Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వున్న మహిళలపై గ్యాంగ్ రేప్‌.. కాళ్లు కదపకుండా బండరాయిని?

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను గుర్తించిన కామాంధులు వారిపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టిన ఘటన ఈ నెల 16న బెంగళూరు నగర శివారులోని నెలమంగళకు సమీపంలో

Woman
Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (11:48 IST)
ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను గుర్తించిన కామాంధులు వారిపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టిన ఘటన ఈ నెల 16న బెంగళూరు నగర శివారులోని నెలమంగళకు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాదనాయకహళ్లికి చెందిన కార్మికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
కార్మికురాలి భర్త ఇంట్లో లేడనే విషయాన్ని గమనించిన రాజగోపాల్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ కుమార్ (32), లగ్గెరెకు చెందిన పునీత్ (22), లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి కార్మికురాలి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ అత్యాచారం కార్మికురాలి భర్త కంట ముందే జరిగిందని పోలీసులు చెప్తున్నారు.
 
ఇదే విధంగా శుక్రవారం రాత్రి నేపాల్‌కు చెందిన యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా వున్న ఆమెను కామాంధులు పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆపై ఆమె కాళ్లు కదపకుండా వుండేందుకు పెద్ద బండరాయిని ఉంచి పారిపోయారు. అయితే బాధితురాలు కేకలు విని స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం