Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. అక్రమ సంబంధం.. భర్తను తొడపై కాల్చేసింది..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (18:57 IST)
అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య కార్చిచ్చులు రేపుతున్నాయి. ఇటీవల భార్యాభర్తలు కలిసి ఉండటం కల్లగా మారింది. విడాకులు తీసుకోవడం నుండి హత్యలు చేయడం వరకూ దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీసినందుకు భర్తను కాల్చేసింది ఓ మహిళ. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సునీత మింజ్ (39) అనే మహిళ భతాపారా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. అతని భర్త దీపక్ శ్రీవాస్తవ (42) కూడా రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీశాడు. ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అది ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. కోపావేశంతో భార్య తన సర్వీస్ రివాల్వర్ తీసి దీపక్‌ని కాల్చింది. గాలిలో రెండు సార్లు కాల్పులు జరిపి ఆ తర్వాత అతని తొడపై కాల్చింది. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హత్యాయత్నం క్రింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments