Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. అక్రమ సంబంధం.. భర్తను తొడపై కాల్చేసింది..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (18:57 IST)
అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య కార్చిచ్చులు రేపుతున్నాయి. ఇటీవల భార్యాభర్తలు కలిసి ఉండటం కల్లగా మారింది. విడాకులు తీసుకోవడం నుండి హత్యలు చేయడం వరకూ దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీసినందుకు భర్తను కాల్చేసింది ఓ మహిళ. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సునీత మింజ్ (39) అనే మహిళ భతాపారా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. అతని భర్త దీపక్ శ్రీవాస్తవ (42) కూడా రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీశాడు. ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అది ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. కోపావేశంతో భార్య తన సర్వీస్ రివాల్వర్ తీసి దీపక్‌ని కాల్చింది. గాలిలో రెండు సార్లు కాల్పులు జరిపి ఆ తర్వాత అతని తొడపై కాల్చింది. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హత్యాయత్నం క్రింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments